మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ(DKSZC) సభ్యుడు, పశ్చిమ బస్తర్ డివిజన్ కమాండర్ పాపారావు లొంగిపోవడానికి సిద్ధమయ్యారు. తనతో పాటు సుమారు 12 నుండి 17 మంది సభ్యులతో కలిసి ఆయన పోలీసుల ముందు లొంగిపోనున్నట్లు సమాచారం. దశాబ్దాలుగా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.