W.G: UTF రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అసెంబ్లీ కేంద్రాలు వద్ద ఒకరోజు నిరాహార దీక్షలో భాగంగా ఉండిలో UTF రణభేరిని మంగళవారం నిర్వహించింది. తక్షణమే 12 వ PRC వేసి IR 29 శాతం ప్రకటించాలని కోరుతూ నిరాహార చేస్తున్నట్టు UTF జిల్లా కార్యదర్శి P.క్రాంతి కుమార్, ప్రెసిడెంట్ విజయరామరాజు తెలిపారు. ఉండి, ఆకివీడు, పాలకోడేరు మండలాల ఉపాధ్యాయులు, పెన్షనర్స్ పాల్గొన్నారు.