భారత క్రికెటర్ రింకూ సింగ్కు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రాంతీయ క్రీడా అధికారి ఉద్యోగాన్ని ఇచ్చి గౌరవించింది. 2026 T20 ప్రపంచ కప్లో ప్రదర్శన, అంతర్జాతీయ పతకాల నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సూర్యకుమార్ సారథ్యంలో టీ20 ప్రపంచకప్ 2026 గెలిచిన భారత జట్టులో రింకూ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.