AKP: జింక్ ఫుడ్ తీసుకుంటే అనారోగ్యానికి గురవుతారని ఎలమంచిలి ఐసీడీఎస్ సీడీపీఓ ఇంద్రాదేవి అన్నారు. మునగపాక అంగన్వాడి కేంద్రాన్ని ఆమె శనివారం సందర్శించారు. ఆకుకూరలతో తయారుచేసిన ఆహారం, వివిధ రకాల పండ్లు పిల్లలకు ఇవ్వాలన్నారు. ఆటపాటలతో పిల్లలకు విద్యాబోధన చేయాలన్నారు. స్థానికంగా దొరికే వస్తువులతో ఆట బొమ్మలు తయారు చేయాలన్నారు.