W.G: నరసాపురం మండలం కంసాలిబేతపూడిలో భారీ దొంగతనం జరిగింది. పాలీ నాగేశ్వరరావు దంపతులు వైద్యం కోసం పాలకొల్లు వెళ్లి తిరిగి వచ్చేసరికి, దుండగులు ఇంటి తలుపులు పగలగొట్టి బీరువాలోని 4.5 సవర్ల బంగారం, 200 గ్రాముల వెండిని ఎత్తుకెళ్లారు. శనివారం బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై టి.వి. సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.