NDL: ఇవాళ రాష్ట్రంలో గరిష్ఠంగా సంజామల(నంద్యాల) 44.6°C డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43-44°C మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మన్యం, పశ్చిమ గోదావరి, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది.