TPT: చిత్తూరు పట్టణంలో మహిళల భద్రత, పిల్లల రక్షణపై శక్తి టీం, మహిళా పోలీస్ సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలపై వేధింపులు, బాలలపై నేరాలు, సోషల్ మీడియా మోసాలపై అవగాహన కల్పించడంతో పాటు శక్తి యాప్ వినియోగంపై వివరించారు. సుమారు 500 మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు వివరించారు.