సత్యసాయి: హిందూపురంలోని మూడో వార్డులలో హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ కుమార్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే 3వ వార్డులో సచివాలయం సందర్శించి, రికార్డులను పరిశీలించారు. సచివాలయ సిబ్బంది విధులు నిర్వహణపై మాట్లాడారు. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని అర్హులైన వారందరికీ అందేలా చూడాలన్నారు.