మార్కాపురం పట్టణంలో శనివారం ‘స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ వెళ్లే రోడ్లో గల పరిసరాలను, కాలువలో ఉన్న చెత్తాచెదారాన్ని కలెక్టర్ ఎం.విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తొలగించారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.