PLD: ఈపూరు మండలం బొగ్గరం గ్రామానికి చెందిన పిట్టల నాగమణి (24), ఆమె కుమార్తె త్రివేణి అదృశ్యమయ్యారని ఎస్సై వేణుగోపాల్ తెలిపారు. ఈ నెల 24న ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో, నాగమణి తల్లి వెంకటరమణ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త శ్రీనుతో ఉన్న మనస్పర్ధలే వీరి అదృశ్యానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.