GNTR: తెనాలి రైల్వే స్టేషన్లో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. రేపల్లె మండలం నల్లూరివారిపాలెంకు చెందిన యలవర్తి సుబ్బారావు (70) రెండో నంబర్ ప్లాట్ఫాం వద్ద టిఫిన్ చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందారు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.