W.G: పాలకొల్లు శ్రీ ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ కళాశాలలో ఇవాళ విద్యార్థులకు ‘డ్రై ఐ సిండ్రోమ్’ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. లక్ష్మీపతిరాజు మాట్లాడుతూ.. కళ్లలో మంట, దురద, ఎరుపు ఎక్కడం, దృష్టి మసకబారడం వంటివి వ్యాధి లక్షణాలని, వీటి నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత కాలంలో యువతకు కంటి సమస్యలు పెరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలన్నారు.