TPT: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం మొత్తం 75,174 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 17,734 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, హుండీ ఆదాయం రూ.4.29 కోట్లుగా నమోదైంది. ఇక ఈ రోజు చంద్రగ్రహణం కారణంగా రాత్రి 8:30 గంటలకు శ్రీవారి సర్వదర్శనం ప్రారంభమవుతుందని దేవస్థానం అధికారులు తెలిపారు.