GNTR: చేబ్రోలు (మం) పాతరెడ్డిపాలెంలో పంట కాలువ పూడికతీత పనులకు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర శనివారం శంకుస్థాపన చేశారు. రూ.8 లక్షలతో ఈ పనులు చేపట్టారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు. కాలువల ఆధునీకరణతో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతుందని చెప్పుకొచ్చారు. రైతుల ఇబ్బందులు తొలగించేలా ఈ పనులను త్వరగా పూర్తి చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు.