VZM: జామి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసూతి, బాలింతలు ఉండే గది అపరిశుభ్రంగా ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో ఆసుపత్రి సిబ్బంది పనితీరులో ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రతలో మార్పు రావాలని మంత్రి హెచ్చరికలు జారీ చేశారు.