గుంటూరు జిల్లాలో స్వీయ గణన కార్యక్రమం గురువారం అధికారికంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ సీ.యం. సాయికాంత్ వర్మ స్వయంగా తన వివరాలను నమోదు చేసుకుని ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు https://se.census.gov.in వెబ్సైట్ ద్వారా ప్రతి కుటుంబం తమ వివరాలను సులభంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.