KRNL: ఎమ్మిగనూరు ఎంపీడీవో కార్యాలయంలో MLA బివి.జయనాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మహిళలకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.