GNTR: ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామంలో గురువారం పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి వాసంతి మాట్లాడుతూ.. రైతులు తమ శనగ పంటను 14 శాతం తేమ వరకు ఎండలో బాగా ఆరబెట్టిన తర్వాత రేపూడి గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి క్వింటాల్కు రూ. 5,875 మద్దతు ధరకు విక్రయించాలని సూచించారు.