CTR: మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని సీఐ గోపి పేర్కొన్నారు. పూతలపట్టులో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, వెలుగు సభ్యులకు పోలీసు సిబ్బంది మంగళవారం అవగాహన సమావేశం నిర్వహించారు. బాల్య వివాహాల నివారణ, రోడ్డు ప్రమాదాలు మత్తుపదార్థాల అనర్థాలపై వివరించారు. అత్యవసర సమయాలలో పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.