PLD: పెదకూరపాడు నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ఒకరోజు ముందే పింఛన్ల పంపిణీ చేపట్టారు. ఒకటవ తేదీ ఆదివారం కావడంతో శనివారం ఉదయం నుంచి అధికారులు నాయకులు లబ్ధిదారుల ఇళ్లకు చేరుకొని వారికి పింఛన్లు అందించారు. పింఛను చేతికి రావడంతో అవ్వ తాతల ముఖంలో ఆనందాన్ని చూసామని స్థానిక నేతలు అన్నారు.