ప్రకాశం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ను పరిశీలించిన అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. కోచింగ్ సెంటర్లో విద్యార్థి తౌశిక్ అనుమానాస్పద మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల భద్రతపై యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.