కోనసీమ: అమలాపురం పట్టణంలో మహిపాల వీధిలో ఉన్న పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా ఆదివారం స్వామివారికి లక్ష మల్లె పువ్వులతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శ్రవణ నక్షత్రం రోజున స్వామి వారిని ఆరాధించడం అత్యంత శుభప్రదమని అర్చకులు అన్నారు.