ATP: శింగనమల మండలం లోలూరులో ‘మన గ్రామానికి మన శైలజానాథ్’ కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ కార్యకర్తలు, నాయకులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో పథకాలు అందక ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. కేవలం రాజధాని ముసుగులో సొంతవాళ్లకు లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపించారు.