KDP: ముద్దనూరు టౌన్ పరిధిలోని కొండాపురం వైపు వెళ్లే రైల్వే మార్గంలో 2వ బ్రిడ్జి సమీపంలో సుమారు 65 ఏళ్ల గుర్తుతెలియని వృద్ధుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న సీఐ నాగేష్ బాబు, SI మధుసూదన్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు రెండు రోజుల క్రితం లుంగీతో ఉరేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.