KKD: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్ 12 వరకు ప్రక్రియ సాగనుంది. ఇందుకు సంబంధించి కాకినాడ పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వేర్వేరు జిల్లాలకు చెందిన జవాబు పత్రాలను కాకినాడుకు చేర్చారు.