TPT: పాతనాలపాడు పంచాయతీ రామరాజుపల్లిలోని హరి రాము (22) మూడు రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన కుమారుడు అల్లిగడ్డకు వెళ్లాడని అతని తండ్రి సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేసినట్లు ఇన్ఛార్జ్ ఎస్సై సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.