AKP: కోటవురట్ల మండలం కొడవటిపూడి జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం మండల విద్యాశాఖ అధికారి రామారావు తనిఖీ చేశారు. భోజనం కూరలు సాంబారు పరిశీలించారు. భోజనాన్ని రుచి చూశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలన్నారు. ముఖ్యంగా పరిశుభ్రత పాటించాలన్నారు. ఉపాధ్యాయులు ఈ పథకాన్ని పర్యవేక్షించాలని అన్నారు. హెచ్ఎం ప్రతాప్ కుమార్ పాల్గొన్నారు.