అన్నమయ్య: రాయలసీమ హక్కుల పేరిట వైసీపీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం రాజకీయ డ్రామా మాత్రమేనని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. జగన్ హయాంలో రాయలసీమకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులపై భారీగా నిధులు ఖర్చు చేసిందని, ప్రస్తుతం సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వంలో అభివృద్ధి వేగవంతం చేస్తున్నామని తెలిపారు.