ELR: నీటి సంరక్షణ దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా జడ్జి రత్న ప్రసాద్ సోమవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రానున్న రోజుల్లో మంచినీటి కోసం యుద్ధం జరిగే రోజులు రానున్నాయని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యాలయం వద్ద స్పష్టం చేశారు. నీటిని వృథా చేయకూడదని సూచించారు. భూగర్భజలాలను సంరక్షించకపోతే భవిష్యత్ తరాలకు నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు.