W.G: ఉండి మార్కెట్ యార్డ్లో నియోజకవర్గస్థాయిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ.. మహిళలను గౌరవించడం అందరి బాధ్యతని, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. మహిళలు అందరూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని మరింత ముందుకు సాగాలన్నారు.