కోనసీమ: మీరు ఇచ్చిన ఆశీర్వాదం, మీ ఓటు విలువ ఈరోజు అభివృద్ధిగా మీ ముందు ఉందని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు. పి.గన్నవరం డొక్కా సీతమ్మ వారధిపై రాకపోకలను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఓఎన్జీసీ సీఎస్సార్ నిధులు రూ.61 లక్షలతో ఈ బ్రిడ్జి మరమ్మతు పనులు నిర్వహించారు. దీంతో పాటు వారధిపై సోలార్ లైట్లు బిగించారు.