ATP: రేషన్ పంపిణీలో అవకతవకలకు పాల్పడితే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో రేషన్ డీలర్లు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. తూకాల్లో మోసం చేసినా, సరుకులు నిలిపివేసినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ అందించాలని ఆదేశించారు.