VZM: ఎస్ కోట మండల కేంద్రంలోని బ్రాహ్మణవీధి రామాలయంలో శ్రీ సీతారాముల పట్టాభిషేక మహోత్సవం శనివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా స్వామివారికి అర్చనలు, అభిషేకాలు జరిపి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘురాజు, తదితరులు పాల్గొన్నారు.