TG: అసెంబ్లీలో BRS ఎమ్మెల్యేలకు కడియం శ్రీహరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘సభలో బీఆర్ఎస్ సభ్యులు సిగ్గు లేకుండా అరుస్తున్నారు. రాష్ట్రంలో అనేక రకాల భూ దోపిడీ జరిగింది. ధరణిని అడ్డం పెట్టుకుని వందల ఎకరాల భూమిని గుంజుకున్నారు. బాలానగర్ భూముల స్కామ్పై హౌస్ కమిటీ వేయండి. నిజంగా నిజాయితీ ఉంటే బీఆర్ఎస్ సభ్యులు హౌస్ కమిటీకి ఒప్పుకోవాలి’ అంటూ డిమాండ్ చేశారు.