KKD: 2 నెలలకు పైగా కాకినాడ, పోలవరం జిల్లాల్లో కలవరం సృష్టించిన పెద్దపులి ఇప్పుడు పోలవరం అటవీ ప్రాంతంలో సంచరిస్తూ గిరిజన గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. శనివారం జోడుమామిళ్ల, పోతవరం పరిసరాల్లో పులి కదలికలను గుర్తించినట్లు సబ్ DFA అనూష, రేంజ్ అధికారి కొండలరావు తెలిపారు. పులి అటవీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతాల వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు.