ప్రకాశం: పీసీపల్లి మండలంలోని విఠలాపురం గ్రామంలో వైసీపీ నాయకుడు భోగాల మాలకొండారెడ్డి కుమారుడు ప్రభాకర్ రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ శుక్రవారం ప్రభాకర్ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.