కోనసీమ: శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి ని రాష్ట్ర పండుగగా ప్రకటించడం బీసీల పట్ల సీఎం చంద్రబాబుకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. ఇవాళ అమలాపురం హైస్కూల్ సెంటర్ వద్ద వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.