VZM: విశాఖ ఎంపీ ఎం. శ్రీ భరత్ స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారితో కలిసి బుధవారం కొత్తవలస రైల్వేస్టేషన్ను సందర్శించారు. కొత్తవలస రైల్వేస్టేషన్లో జరుగుతున్న అమృత్ భారత్ పనులను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిపై రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్ రైలు నిలుపుదలపై ప్రస్తావించగా రైల్వే మంత్రి పరిశీలనలో ఉన్నట్లు స్పష్టం చేశారు.