VZM: విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో సిగరెట్లు, ఖైనీ, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ఇవాళ హెచ్చరించారు. ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ పేరుతో జిల్లా వ్యాప్తంగా పాన్ షాపులు, కిరాణ దుకాణాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ డ్రైవ్లో ఇప్పటి వరకు 347 కేసులు నమోదు చేశామన్నారు.