W.G: భీమవరంలో ఓ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో బుధవారం జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలు, భూస్వాములు, రైతులతో ఎంఎస్ఎంఈ పార్క్ పాలసీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి పాల్గొని మాట్లాడారు. యువత పారిశ్రామిక రంగం వైపు దృష్టి సారిస్తే ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు.