కృష్ణా: గన్నవరం మండలం బూతుమిల్లిపాడులో రూ.23.94 లక్షలతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బుధవారం ప్రారంభించారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, సలహాలు ఒకేచోట అందించడమే లక్ష్యమన్నారు. రూ.3 లక్షల విరాళం ఇచ్చిన ముక్కాముల సుబ్బారావును ప్రశంసించారు. గ్రామ అభివృద్ధి పనులు త్వరలో పూర్తిచేస్తామని తెలిపారు.