సత్యసాయి: అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో మడకశిర సబ్ డివిజన్ విద్యుత్ డీఈఈ రఘును సస్పెండ్ చేస్తూ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ ఉత్తర్వులు ఇచ్చారు. నిబంధనల అతిక్రమణ, రైతులకు సామగ్రి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం, అనధికారికంగా విద్యుత్ లైన్లు మార్చడం వంటి ఆరోపణలు ఆయనపై వచ్చాయి. వీటిపై విచారణ జరిపించిన అధికారులు అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు.