CTR: చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజల నుంచి 123 వినతులను స్వీకరించారు. ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి, రీ ఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.