VZM: మెరకముడిదాం మండలం కొర్లాం గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీవో భాస్కర్ రావు బుధవారం పరిశీలించారు. ఈరోజు సంబంధించిన వేతనదారులు హాజరును చూసారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ పనులకు హాజరు కావాలని ఆయన సూచించారు. పని ప్రదేశంలో టెంట్స్ వేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఇంటికాడ చల్లార్చిన వ్యక్తిగత వాటర్ తీసుకొని రావాలని కోరారు.