ATP: ఈ నెల 20న CM చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే రక్తదాన శిబిరంలో పాల్గొనే వారికి రూ.3 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు టీడీపీ నాయకుడు దేవినేని ధర్మతేజ తెలిపారు. కంబదూరు మండలం తిమ్మాపురంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.