సత్యసాయి: చిలమత్తూరు మండలం సోమగుట్టలో ఆదివారం నిర్వహించిన శ్రీ మధుగిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో హిందూపురం ఎంపీ పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దేవస్థానాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథోత్సవంలో పాల్గొని భక్తులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.