JGL: కథలాపూర్ మండలవ్యాప్తంగా 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. పెద్ద శబ్దం వినిపించడంతో ప్రజలందరూ ఒక్కసారిగా బయటికి వచ్చి భయబ్రాంతులకు గురయ్యారు. ఆదివారం సుమారు 12:47 నిముషాల సమయంలో భూమి కంపించింది. దీంతో ఏమి జరుగుతుందో తెలియక ప్రజలు భయందోళనకు గురయ్యారు. గతంలో ఇలాంటి శబ్దం ఎప్పుడు వినిపించలేదని ప్రజలు పేర్కొంటున్నారు.