ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళా సాధికారత లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.