PDPL: మంథని మండలంలో పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు ఎంఈవో దాసరి లక్ష్మి తెలిపారు. పరీక్షల నిర్వహణకు 2 సెంటర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మంథని పట్టణంలోని ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్లో ఒక సెంటర్, సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఒక సెంటర్ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి మొత్తం 442 మంది విద్యార్థులు ఉన్నారన్నారు.