CTR: సదుం మండలంలోని 79 ఏ చింతమాకులపల్లె పంచాయతీ కారేవాండ్ల పల్లెలో నూతనంగా నిర్మించిన సీతారామ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఆదివారం వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం సీతారామ, లక్ష్మణ పంచలోహ విగ్రహ ప్రతిష్ట, హోమాలు, కుంభాభిషేకం, దర్శన కార్యక్రామలు జరిపారు. వేదపండుతుల మంత్రోచ్ఛారణల మధ్య సీతారామ కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు.